రైటర్స్ పై పోసాని షాకింగ్ కామెంట్స్
on Oct 3, 2016
పోసాని కృష్ణమురళి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాల్లోనే కాదు, బయటా పంచ్ల మీద పంచ్లు వేసేస్తుంటారు. ఎవ్వరినీ వదిలిపెట్టని ముక్కుసూటితనం పోసాని సొంతం. ఈసారి ఆయన రైటర్లమీద పడ్డారు. రైటర్ల సంస్క్రృతిపై, వాళ్ల అడ్డగోలు వ్యవహారాలపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. నిర్మాతలు కథలు రాయడానికి రూమ్లు బుక్ చేస్తే.. అమ్మాయిల్ని పిలిపించుకొని, మందు కొట్టి, నిర్మాత ఖాతాలో ఎస్డీడీ ఫోన్లు చేసుకొని.. నానా రాద్దాంతం చేస్తున్నారని అందుకే రైటర్లపై గౌరవం తగ్గుతోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం కథలు రాసేటప్పుడు నిజాయతీగా వ్యవహరించానని, అందుకే వంద సినిమాలు చేయగలిగానని, అతి తక్కువ కాలంలో వంద సినిమాలకు రాసిన రచయిత తానొక్కడినే నని.. పనిలో పనిగా సొంత డబ్బా కూడా కొట్టుకొన్నాడు పోసాని. చిరు, పవన్ల ప్రస్తావన వస్తే... చిరు నిజాయతీ పరుడని, పవన్ కల్యాణ్ గురించి తానేమీ వ్యాఖ్యానించదలచుకోలేదని మెగా బ్రదర్స్పై కామెంట్స్ చేశాడు పోసాని కృష్ణమురళి. రచయితలకు గౌరవం తగ్గుతోందని ఓపక్క రైటర్స్ తెగ ఇదైపోతోంటే... రచయిత అయ్యిండి వాళ్లపై నెగిటీవ్ కామెంట్స్ చేయడం నిజంగా షాకింగ్ విషయమే. ఓ సీరియర్ రచయితగా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పోసాని చేసిన కామెంట్స్పై ఈతరం రచయితలు ఎలా స్పందిస్తారో చూడాలి.