ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్-డైరెక్టర్ శివన్ కన్నుమూత
on Jun 24, 2021
ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్, ఫిల్మ్ డైరెక్టర్ శివన్ గురువారం ఉదయం తిరువనంతపురంలోని తమ ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. కేరళలో తొలి ప్రెస్ ఫొటోగ్రాఫర్గా పేరుపొందిన శివన్.. తిరువనంతపురంలో 'శివన్ స్టూడియోస్'ను ప్రారంభించారు. క్లాసిక్ ఫిల్మ్ 'చెమీన్'కు స్టిల్స్ అందించిన ఫొటోగ్రాఫర్గా ఆయన పేరు అప్పట్లో అందరికీ తెలిసింది. ఆయన మూడు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆయన కుమారులు సంగీత్ శివన్, సంతోష్ శివన్, సంజీవ్ శివన్ ముగ్గురూ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. సంగీత్ డైరెక్టర్-స్క్రీన్ రైటర్గా, సంతోష్ సినిమాటోగ్రాఫర్-డైరెక్టర్గా, సంజీవ్ డైరెక్టర్గా తమదైన ముద్రను వేస్తున్నారు.
శివన్ పనిచేసిన పాపులర్ ఫిలిమ్స్లో అభయమ్, యాగమ్, మోహంగళ్, కిలివాథిల్, కేశు, ఒరు యాత్ర లాంటివి ఉన్నాయి. "ఆయన మా ఇన్స్పిరేషన్, మా రోల్ మోడల్. హార్డ్వర్క్, అంకితభావనం, క్రమశిక్షణ, ముందుచూపుతో ఆయన విజయాలు సాధించారు. మా తదుపరి ప్రయాణాన్ని కూడా ఆయన గైడ్ చేస్తుంటారని కచ్చితంగా చెప్పగలను. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాం. మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. లవ్ యు డాడ్ ఫర్ ఎవరిథింగ్. మేఘాల్లోంచి, నక్షత్రాల్లోంచి మమ్మల్ని గమనిస్తుంటావని మాకు తెలుసు." అని తన ఫేస్బుక్ హ్యాండిల్ ద్వారా నివాళులర్పించారు సంగీత్ శివన్.
Also Read