ENGLISH | TELUGU  

ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్'!

on Oct 28, 2022

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తమిళ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్-1'. సెప్టెంబర్ 30న భారీస్థాయిలో విడుదలైన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నాలుగు వారాలకే ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది.

ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో అద్దె ప్రాతిపదికన 'పొన్నియిన్ సెల్వన్-1' అందుబాటులోకి వచ్చింది. వారం రోజుల తర్వాత అంటే నవంబర్ 4 నుంచి ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ ఎటువంటి అద్దె చెల్లించకుండానే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. అంటే థియేటర్స్ లో విడుదలైన సరిగ్గా ఐదు వారాలకు ఈ చిత్రం పూర్తిస్థాయిలో ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతుందన్నమాట. 

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. 'పొన్నియిన్ సెల్వన్-2' వచ్చే ఏడాది విడుదల కానుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.