కశ్యప్పై రేప్ కేసు పెట్టిన పాయల్!
on Sep 23, 2020
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజుల తరువాత, నటి పాయల్ ఘోష్ ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో అతనిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. ఐపిసిలోని 376, 354, 341, 342 సెక్షన్ల కింద తప్పుగా నిర్బంధించడం, అత్యాచార యత్నం చేయడం, మహిళ గౌరవానికి భంగం కలిగించడం వంటి నేరాల కింత ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఇంకా దాఖలు చేయలేదు.
సెప్టెంబర్ 20 న, అనురాగ్ కశ్యప్ తరపు న్యాయవాది ఒక ప్రకటన విడుదల చేస్తూ, "నా క్లయింట్ అనురాగ్ కశ్యప్ ఇటీవల తనపై చేసిన తప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలతో తీవ్రంగా బాధపడ్డారు. ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, హానికరమైనవి, నిజాయితీ లేనివి. కల్పిత ఆరోపణలు మీ టూ ఉద్యమాన్ని బలహీనపరుస్తాయి. అంతే కాకుండా నిజమైన లైంగిక వేధింపుల బాధితులకు న్యాయం జరగదు. నా క్లయింట్కు హక్కులు, చట్టంలో నివారణల గురించి పూర్తిగా తెలుసు. వాటిని పూర్తి స్థాయిలో కొనసాగించాలని అనుకుంటున్నారు." అని పేర్కొన్నారు.
అనురాగ్ కశ్యప్ సెప్టెంబర్ 19న తనపై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
