ఫ్యాన్స్ కు దెబ్బ తగిలితే వాళ్లకంటే నాకే బాధ - పవన్ కళ్యాణ్
on Mar 19, 2016

రేపు జరగబోయే సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన మాటల్లో : " రిలీజయ్యే సినిమా గురించి మాట్లాడటం నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఆడియో ఫంక్షన్ గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఫ్యాన్స్ లో ఎవరికైతే పాస్ లు ఉన్నాయో వాళ్లు మాత్రమే ఆడియో వెన్యూ కు రండి. దయచేసి పాస్ లు లేనివాళ్లు రావద్దు. పోలీసులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఫారిన్ డెలిగేట్స్ ఇదే హోటల్లో ఉన్న కారణంగా, సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్ పాస్ లు లేకపోతే రావద్దు అని నా రిక్వెస్ట్" అని పవన్ చెప్పారు. మీ అభిమానులు అర్ధం చేసుకుంటారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్," వాళ్లకు దెబ్బలు తగిలితే వాళ్లకంటే నాకే ఎక్కువ బాధ. నేను చెప్పేది వాళ్లు అర్ధం చేసుకుంటారు. ఫర్లేదు" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



