పవన్ పుస్తకం రాస్తున్నాడహో...
on Sep 13, 2016
పవన్ కల్యాణ్ ఏం చేసినా సంచలనమే. మాట్లాడినా, మౌనంగా ఉన్నా విశేషమే. అలాంటి పవన్ కల్యాణ్ ఓ పుస్తకం రాస్తున్నాడంటే.. సంచలనమే కదా? అవును... పవన్ కల్యాణ్ ఇప్పుడు పెన్ను పట్టుకొంటున్నాడు. అది సినిమా కథ రాయడానికి కాదు. ఓ పుస్తకం రాయడానికి. ఆ పుస్తకం పేరేంటో తెలుసా?? 'నేను - జనం - మనం". ఇది రాజకీయ కోణంలో సాగే పుస్తకం. రాజకీయాలపై తనకున్న అవగాహన, తన అభిప్రాయాలు ఇవన్నీ ఈ పుస్తకంలో వివరిస్తున్నాడట. వివిధ పార్టీలపై, నాయకులపై తనపై వస్తున్న విమర్శలపై పవన్ ఈ పుస్తకంలో సూటిగా పమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. వచ్చే యేడాది ప్రధమార్థంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాడు. ఇది వరకు పవన్ 'ఇజం' అనే ఓ పుస్తకం రాశాడు. అది ఇంగ్లీష్లో అచ్చయ్యింది. ఇది మాత్రం తెలుగులో రాస్తున్నాడట. ప్రస్తుత రాజకీయాలపై పవన్ తనదైన శైలిలో పంచ్లు వేయడానికి ఈ పుస్తకాన్ని వేదిక చేసుకొన్నాడని తెలుస్తోంది. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు తన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇందులో అక్షర రూపంలో చెప్పబోతున్నాడని వినికిడి. మరి పవన్ పుస్తకం ఎన్ని సంచలనాలు సృష్టించబోతోందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.