క్రిష్ సినిమా పక్కన పెట్టి... పవన్ ఆ రీమేక్ స్టార్ట్ చేస్తాడా?
on Oct 8, 2020
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం హైదరాబాదులో పునః ప్రారంభమైంది. అయితే, పవర్ స్టార్ చిత్రీకరణలో పాల్గొనడం లేదు. ప్రస్తుతం ఆయన చతుర్మాస్య దీక్షలో ఉన్నారు. అది విజయదశమికి పూర్తి అవుతుందట. ఆ తర్వాత నుండి పవన్ 'వకీల్ సాబ్' చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. నవంబర్ నెలాఖరుకు తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తి చేసేలా ఆయన ప్లాన్ చేసుకున్నారట. ఆ తరవాత మరో రీమేక్ స్టార్ట్ చేస్తారని ఫిలింనగర్ గుసగుస.
'వకీల్ సాబ్' కాకుండా క్రిష్ దర్శకత్వంలో ఒక పిరియాడిక్ ఫిల్మ్ చిత్రీకరణ కూడా పవన్ ప్రారంభించారు. అయితే... మళ్లీ ఆ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని సమాచారం. సమయం వృధా చేయకుండా మధ్యలో మరో సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకున్నారట.
జనవరి నుండి 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ కు త్వరగా దర్శకుడిని ఖరారు చేయమని పవన్ చెప్పడంతో... ఆ సంస్థతో పాటు పవన్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన పనిలో ఉన్నారని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ తెలుగు నేటివిటీకి తగినట్లు మార్పులు చేసి త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. దర్శకుడు ఖరారైతే త్వరగా చిత్రీకరణ ప్రారంభిస్తారు. రెండు మూడు నెలల్లో సినిమా పూర్తి చేయాలని టార్గెట్ కింద పెట్టుకున్నారట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
