కాశ్మీర్ ఎవరిది? యుద్ధం ఎవరిపై??
on Mar 4, 2019
'నేను టైమ్ ను కాదు... నా టైమింగ్ ను నమ్ముతా' - 'గబ్బర్ సింగ్'లో పవన్ కల్యాణ్ డైలాగ్! ఈ రోజు (సోమవారం) విడుదలైన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' టీజర్ చూస్తే ఈ డైలాగ్ గుర్తుకు రాక మానదు. టీజర్ విడుదల చేసిన టైమింగ్ 👌👌👌. ప్రస్తుతం ఇండియా - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... తీవ్రవాదం గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్రతరమైన చర్చ జరుగుతున్న తరుణంలో... ఆ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా తీవ్రవాదం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఎన్.ఎస్.జి. కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్ నటించిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. వినాయకుడు, కేరింత వంటి మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అడివి సాయి కిరణ్ దర్శకత్వం వహించారు. తీవ్రవాది ఘాజీ బాబా పాత్రలో రచయిత అబ్బూరి రవి నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే... కాశ్మీర్ వేర్పాటు వాదులకు, భారత సైన్యానికి మధ్య జరిగే యుద్ధమే చిత్రకథ. ఇందులో కాలేజీ విద్యార్థులకు సంబంధం ఏంటీ? అనేది ఆసక్తికరం. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందులో 'యుద్ధం ఎవరిపై? కాశ్మీర్ ఎవరిది??' వంటి డైలాగులు ప్రస్తుతం పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయి. మొత్తం మీద టీజర్ తో అడివి సాయి కిరణ్ సక్సెస్ అయినట్టే.