'గుంటూరు కారం'కి 'ఒక్కడు' సెంటిమెంట్
on Jul 16, 2023

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో 'ఒక్కడు' సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2003 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో మహేష్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించాడు. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన పతాక సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ 'ఒక్కడు' సెంటిమెంట్ 'గుంటూరు కారం'కి తోడు కానుంది.
'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ మాస్ అవతార్ చూడబోతున్నామని ఇప్పటికే మేకర్స్ గ్లింప్స్ తో చెప్పేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అదిరిపోయే కబడ్డీ యాక్షన్ సీక్వెన్స్ ఉందట. ఇది సినిమాకే హైలైట్ గా నిలవనుంది అంటున్నారు.
'గుంటూరు కారం'లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న విడుదల కానుంది. అప్పుడు కబడ్డీ ప్లేయర్ గా ఒక్కడుతో ఘన విజయాన్ని అందుకున్న మహేష్, ఇప్పుడు కబడ్డీ యాక్షన్ ఎపిసోడ్ తో 'గుంటూరు కారం'కి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



