Home

»

Latest News

'ఆచార్య' ఎఫెక్ట్‌.. NTR 30 సెట్స్ మీద‌కు వెళ్లేది సెప్టెంబ‌ర్‌లోనే!

Jul 9, 2022 5:17PM

 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన 'జ‌న‌తా గ్యారేజ్' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించింది. 'ఆర్ఆఆర్ఆర్' మూవీ త‌ర్వాత కొర‌టాల డైరెక్ష‌న్‌లో' NTR 30'ని చేసేందుకు డిసైడ్ అయ్యాడు తార‌క్‌. ఈ నెల్లోనే ఆ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉంది. అయితే కొర‌టాల శివ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్‌లో జాప్యం జ‌రుగుతోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. 

చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో త‌ను తెర‌కెక్కించిన 'ఆచార్య' మూవీకి సంబంధించిన స‌మ‌స్య‌ల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నాడు కొర‌టాల శివ‌. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా డిజాస్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్లు 60 శాతం పైగా న‌ష్టాలు చ‌విచూశారు. దాంతో నిర్మాత‌లు వారి న‌ష్టాల్లో కొంత భ‌రించ‌డానికి రెడీ అయ్యారు. ఆ సినిమా బిజినెస్‌లో కొర‌టాల కూడా భాగం పంచుకోవ‌డం వ‌ల్ల‌, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించే విష‌యాన్ని కూడా అత‌ను చూసుకుంటున్నాడు. ఇప్ప‌టికీ అవి ఓ కొలిక్కి రాలేదంటున్నారు. ఇది 'NTR 30' షూటింగ్ షెడ్యూళ్ల‌పై ప్ర‌భావం చూపుతోంద‌ని వినిపిస్తోంది. ఈ నెల్లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లాల్సి వుండ‌గా, ఇప్పుడు అది సెప్టెంబ‌ర్‌కు వాయిదా ప‌డింద‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా స‌మంత పేరు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అందులో నిజం లేద‌నీ, ఇంకా హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేద‌నీ తెలిసింది. ఈ మూవీకి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com