ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి చేసుకుని ఒక ఇంటిదయ్యింది..!
on Mar 30, 2016
ఎన్టీఆర్ తో సింహాద్రి మూవీలో ఆడిపాడిన అంకిత గుర్తుందా..? అంకిత కంటే రస్నా బేబీగానే ఈ అమ్మడు బాగా ఫ్యామస్. పుణేకు చెందిన విశాల్ జగ్తాఫ్ తో ఈ భామ వివాహం జరిగింది. చాలా ప్రైవేట్ అఫైర్ గా, సింపుల్ గా పెళ్లి చేసుకున్న రస్నా బేబీ, పరిశ్రమకు సంబంధించిన వాళ్లెవరినీ పిలవలేదు. కేవలం సన్నిహితులు, వెల్ విషర్స్ సమక్షంలో పెళ్లిని ముగించేసింది. వైవిఎస్ చౌదరి తీసిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైంది. తెలుగు తమిళం కలిపి దాదాసు 20 సినిమాలకు పైగానే నటించినా, సరైన బ్రేక్ రాలేదు. ఎంత ట్రై చేసినా కెరీర్ ఊపందుకోకపోవడంతో, అమెరికాలో తన తండ్రికి ఉన్న డైమండ్స్ బిజినెస్ చూసుకుంటున్న అంకితకు, అక్కడే బిజినెస్ మ్యాన్ విశాల్ తో పరిచయమైంది. పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల్ని ఒప్పించి మార్చి 28న ఒక ఇంటి వాళ్లయ్యారు.