‘లక్ష్మీస్ వీరగ్రంథం’ కథ అదేనా?
on Oct 26, 2017
లక్ష్మీస్ వీరగ్రంధం... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ టాపిక్కే. ఇప్పటికే రెండు బయోపిక్కులు అన్నగారి కథ ఆదారంగా తయారవుతుంటే.. మధ్యలో మూడో సినిమా ఎనౌన్స్ చేసి... వేడిని ఇంకాస్త రాజేశాడు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. అయితే.. ఈ సినిమా కథ విషయంలో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూశాయ్. బాలకృష్ణ తీస్తున్న సినిమా... ఎన్టీయార్ పుట్టినప్పట్నుంచీ... రాజకీయాల్లో చక్రం తిప్పిన వరకూ ఉంటే... రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమా... ఎన్టీయార్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయినప్పటి వరకూ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇక కొత్తగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తీయబోతున్న ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమా కథ వీటికి భిన్నం. కేవలం లక్ష్మీపార్వతి జీవితం మాత్రమే ఈ కథలో ఉంటుందని తెలిసింది. ఆమె పుట్టున.. పెరిగిన విధానం.. ఎదిగిన వైనం.. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. ఎన్టీయార్ జీవితంలోకి అడుగుపెట్టడంతో సినిమా ముగుస్తుందట. ఈ సినిమా కథ ఇదే అంటూ... ఓ కథ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. దాని వివరాల్లోకెళ్తే..
లక్ష్మీ పార్వతి తల్లితో వీరగంధం చేరువగా ఉండేవాడట. ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని పరిణామాలు లక్ష్మీపార్వతిని వీరగంధం వివాహం చేసుకోవడానికి దారి తీశాయట. ఆమె జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు.. ఆమెను కర్కశంగా.. కఠినంగా మార్చాయట. సమాజం యావగింపుకు గురైన తాను.. ఆ సమాజంతోనే దండాలు పెట్టించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుందట. ఆ తర్వాత.. ఆమె ఉద్దేశపూర్వకంగానే ఎన్టీయార్ వద్దకు చేరదన్నట్టు కథ సాగుతుందని టాక్.
మరి ఈ కథలో ఎంత నిజం ఉంది?.. అసలు ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ కథ ఇదేనా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే ఏడాది జనవరిలోనే సినిమాను విడుదల చేస్తారట. చూద్దాం.