హిందీలో రీమేక్ కానున్న 'భీష్మ'?
on May 25, 2020
బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడుతున్నంత కాలం రీమేక్స్ తీస్తూనే ఉంటారు. ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలకు.. అందునా తెలుగు సినిమాలకు బాలీవుడ్లో మంచి గిరాకీ పలుకుతోంది. 'అర్జున్రెడ్డి', 'జెర్సీ' మూవీల తర్వాత మరో తెలుగు సినిమా హిందీలో రీమేక్ కావడానికి సిద్ధమవుతోంది. అది నితిన్, రష్మికా మందన్న జంటగా నటించిన రీసెంట్ హిట్ ఫిల్మ్ 'భీష్మ'. ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొనేందుకు కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వినిపిస్తోంది. ఇటీవల ఆ సినిమా చూసిన ఆయన, బాగా ఇంప్రెస్ అయినట్లు సమాచారం. బాలీవుడ్లో రీమేక్ చేయడానికి తగ్గ విషయం 'భీష్మ'లో ఉందని ఆయన భావిస్తున్నాడనీ, అందుకే ఆ విషయంలో ముందుకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడనీ అంటున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమైతే నితిన్ చేసిన టైటిల్ రోల్ను హిందీ రీమేక్లో రణబీర్ కపూర్ చేసే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటిదాకా ఏ విషయమూ అధికారికంగా ధ్రువపడలేదు. ఇటీవలి కాలంలో కరణ్ జోహార్ తెలుగు సినిమాలపై, తెలుగు ఫిల్మ్ సెలబ్రిటీలపై అభిమానం చూపిస్తూ వస్తున్న విషయం మనం చూస్తున్నాం. 'బాహుబలి' సినిమాలను హిందీలో రిలీజ్ చేసిన ఆయన, ప్రస్తుతం పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ మూవీ 'లైగర్' హిందీ వెర్షన్ను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 'భీష్మ' మూవీ విషయానికి వస్తే, వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.