నితిన్ జోడీగా మరోసారి కీర్తి?
on May 25, 2020
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'అంధాధున్' తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ కానున్నది. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేశ్ అయితే బాగుంటుందని నితిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఈ సినిమాలో హీరోయిన్గా 'నానీస్ గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తూ వచ్చింది. ఇప్పటికే నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు, ఆమె దాదాపు ఖాయమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆమెకు బదులుగా కీర్తి సురేశ్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే నితిన్, కీర్తి జంటగా 'రంగ్ దే' సినిమా చేస్తున్నారు. ఆ మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ మూవీలో నితిన్, కీర్తి జంట చాలా ఆకర్షణీయంగా ఉందని చెప్పుకుంటున్నారు. 'అంధాధున్' రీమేక్లోనూ ఆ జంట మ్యాజిక్ చేస్తుందని వారు భావిస్తున్నారు. ఒరిజనల్ ఫిల్మ్లో అంధుడైన పియానిస్ట్గా ఆయుష్మాన్ ఖురానా నటన సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. అతని జోడీగా రాధికా ఆప్టే నటించగా, మరో కీలక పాత్రను టబు పోషించారు. ఇప్పుడు ఆయుష్మాన్ చేసిన క్యారెక్టర్లో నితిన్ రాణిస్తే, నటుడిగా ఇది అతడిని ఓ మెట్టు పైకెక్కించినట్లే అవుతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆయుష్మాన్కు బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డ్ను సాధించి పెట్టింది. ఫైనల్గా ఈ సినిమాలో నితిన్ జోడీగా కీర్తి, ప్రియాంక.. ఇద్దరిలో ఎవరు ఎంపికవుతారో చూడాలి.