జనం ఎమోషన్స్ను అర్థం చేసుకోవాలి.. రణబీర్కు తల్లి నీతు బర్త్డే విషెస్!
on Sep 29, 2020
స్టార్ యాక్టర్ సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి తర్వాత బాలీవుడ్లో అనేక చర్చలు, వాదవివాదాలు తలెత్తిన విషయం గమనిస్తున్నాం. వాటిలో బంధుప్రీతి, వారసత్వం వంటివి కూడా ఉన్నాయి. తండ్రులకో, తల్లులకో వారసులుగా అడుగుపెట్టిన స్టార్కిడ్స్ను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో సుశాంత్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి ట్రోల్స్కు గురవుతున్నవారిలో ప్రేమజంట రణబీర్ కపూర్, అలియా భట్ ప్రముఖంగా ఉన్నారు. రణబీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్.. ఇద్దరూ యాక్టర్లే. అలాగే అలియా తండ్రి మహేశ్ భట్ డైరెక్టర్ అయితే, తల్లి సోనీ రజ్దాన్ నటి.
సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ 38వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తనయుడికి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెప్పిన నీతూ కపూర్, కేక్ కట్ చేయడానికి సిద్ధంగా ఉన్న రణబీర్ పిక్చర్ను షేర్ చేశారు. "బ్లెస్సింగ్ లేకుండా బర్త్డేస్ అనేవి పూర్తికావు. ప్రజల ఎమోషన్స్ను లోతుగా అర్థంచేసుకోవాలని అతడిని నేను రోజూ దీవిస్తాను. తనచుట్టూ ఉన్నవాళ్లు భద్రతగా ఉండేట్లు చూడమంటాను." అని అందమైన నోట్ కూడా రాశారు.
ఇక తన ప్రియుడికి అలియా కూడా విషెస్ తెలియజేసింది. బర్త్డే కేక్ ముందు అందంగా నవ్వుతూ కూర్చొని ఉన్న రణబీర్ పిక్చర్ను షేర్ చేసిన ఆమె, "హ్యాపీ బర్త్డే 8" అంటూ కాప్షన్ పెట్టి, హార్ట్ ఎమోజీ జోడించింది.