హీరోయిన్ల బ్రాండ్ వాల్యూకి డ్రగ్స్ కేసు దెబ్బ?
on Sep 29, 2020
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరుల బ్రాండ్ వాల్యూ ప్రమాదంలో పడుతుందని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హీరోయిన్లందరూ కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరి చేతిలో ఒకటి కంటే ఎక్కువ బ్రాండ్లు ఉన్నాయి. స్టార్ స్టేటస్ బట్టి బ్రాండ్ ఎండార్స్ మెంట్ వ్యాల్యూ ఉంటుంది. దాన్ని బట్టే రెమ్యూనరేషన్లు డిసైడ్ అవుతాయి.
డ్రగ్స్ కేసులో హీరోయిన్లు విచారణకు వెళ్ళి వస్తూ ఉండటం, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వాళ్ళ మీద నెగిటివ్ క్యాంపెయిన్ నడుస్తూ ఉండడంతో బ్రాండ్ ఎండార్స్ మెంట్లు చేసుకున్న మన ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. గతంలో ఆమిర్ ఖాన్ దేశం పై అసహనం వ్యక్తం చేసిన తర్వాత స్నాప్ డీల్ అతనిని తమ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించింది. ఇప్పుడు హీరోయిన్లకు అటువంటి పరిస్థితి రావచ్చని కొందరు అంటున్నారు.
ప్రస్తుతానికి డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న హీరోయిన్లు ఎవరినీ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా తొలగించనప్పటికీ.... భవిష్యత్తులో వాళ్ళ ఒప్పందాలను పునరుద్ధరించే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read