వెంకీ మామ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్.. థియేటర్లలో 'నారప్ప' విడుదల
on Dec 6, 2022
లాక్ డౌన్ సమయంలో విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప', 'దృశ్యం-2' సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వెంకీ మామ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ముఖ్యంగా 'నారప్ప' విడుదల సమయంలో ఆ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కానీ జులై 20, 2021 న డైరెక్ట్ ఓటీటీలోనే విడుదలైంది ఆ చిత్రం. అయితే ఇప్పుడు ఏకంగా ఏడాది తర్వాత ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ ఒక్కరోజు పాటు థియేటర్స్ లో అలరించడానికి సిద్ధమైంది.
తమిళ్ మూవీ 'అసురన్'కి రీమేక్ గా రూపొందిన చిత్రం 'నారప్ప'. సురేష్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. గతేడాది నేరుగా ఓటీటీలో విడుదలై ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేయనుంది. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
Also Read