ఆడవాళ్లు అలవాట్లకు బానిసలు కావొద్దు...ఆరోగ్యంగా.. స్ట్రాంగ్గా ఉండాలి
on Dec 6, 2022
మహానటి సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. అందులో ఆమె ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో అవమానాలను భరించింది. తాగుడికి బానిసయ్యింది. చివరికి ఆరోగ్యం పాడై మరణించింది. ఈ విషయాలన్నీ మహానటి మూవీలో చూపించారు. మరి అలాంటి మహానటి కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ గురించి అందరికీ తెలుసు. మరి తన తల్లి గురించిన ఎన్నో విషయాలను విజయ చాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
" మా అమ్మ తాగుడికి బానిసైన దగ్గర నుంచి...నేను ఒకటే ఆలోచించేదాన్ని. ఇలాంటి వ్యసనాలకు బానిసలూ కాకూడదు అంటే ఆడవాళ్లు ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి. దానికి ముందు బాడీ ఫిట్ గా ఉండాలి. అందుకే నేను ఈ హెల్త్, ఫిట్నెస్ గురించి ఎంతో మందికి క్లాసెస్ చెప్తూ ఉంటాను, యోగా నేర్పిస్తూ ఉంటాను. కొన్ని సంవత్సరాల పాటు లేడీస్ కోసం జిమ్ కూడా నడిపాను. ఎక్కడికి వెళ్లినా ఏం ఎక్సరసైజ్ చేస్తున్నారంటూ అక్కడివాళ్లను అడుగుతుంటాను. రోజులో ఏదో ఒక టైములో వాకింగ్ చేసినా చాలు ఆరోగ్యంగా ఉంటారు.
నాకంటూ ప్రత్యేకంగా పేరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు..అమ్మ పేరు చెడిపోకుండా నిలబెడితే చాలు ఇక నేను ప్రత్యేకంగా చేసినదైతే ఏమీ లేదు అలాంటి గొప్ప తల్లికి పుట్టడం తప్ప. ఎక్కడికి వెళ్లినా సావిత్రి గారి కూతురు అని రెడ్ కార్పెట్ వేస్తారు నాకు రాయల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఇంతకుమించి ఇంకేం కావాలి నాకు. మా అమ్మ గురించి సినిమాలో చూపించిందంతా నిజమే. అందుకే ఆడవాళ్ళకు నేను ఒక్కటే చెప్తాను. ఎలాంటి అలవాట్లకు బానిసలు కావొద్దు. ఆరోగ్యంగా ఉండండి అదే పది వేలు" అని చెప్పారు విజయ చాముండేశ్వరి.
Also Read