నాగశౌర్య జోరు.. నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలు
on Sep 27, 2021
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఆయన నటిస్తున్న 'వరుడు కావలెను' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నాట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఆయన తదుపరి సినిమా 'లక్ష్య' కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
నాగశౌర్య నటిస్తున్న 20వ సినిమా 'లక్ష్య' ఆర్చరీ బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.
నాగశౌర్య అక్టోబర్ 15న వరుడు కావలెను, నవంబర్ 12న 'లక్ష్య' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలను విడుదల చేస్తున్న నాగశౌర్య.. ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.
Also Read