మరో సినిమా లైనులో పెట్టిన శౌర్య... దసరాకి లాంఛ్!
on Oct 13, 2020
ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న సినిమా చిత్రీకరణ నాగశౌర్య ప్రారంభించారు. ఇది కాకుండా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అమెరికా వెళ్లి చిత్రీకరణ చేయాల్సిన పార్ట్ ఉండటంతో ప్రస్తుతానికి సినిమాను పక్కన పెట్టారు. చిత్రీకరణ వాయిదా వేశారన్నమాట. ఇది కాకుండా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలువిద్య నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు మరో సినిమాను కూడా లైనులో పెడుతున్నాడు.
'అలా ఎలా?' ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. విజయదశమికి ఆ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించనున్నారు. నాగశౌర్య 'ఛలో'కి అతడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది అన్నమాట.