చైతూ-సాయిపల్లవి 'లవ్ స్టోరి'కి సూపర్బ్ అడ్వాన్స్ బుకింగ్స్!
on Sep 18, 2021
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరి' మూవీ సెప్టెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్గా రిలీజవుతోంది. ప్రేక్షకుల నుంచి సాంగ్స్, ప్రోమోస్కు మంచి రెస్పాన్స్ రాగా, హైదరాబాద్లో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్కు సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. మొదటిరోజు 245 షోలకు గాను ఇప్పటికే 85 షోలు ఫుల్ అయిపోగా, మిగతా షోలు కూడా ఫిల్లింగ్ ఫాస్ట్ అవుతున్నాయి. ఈ సినిమా రిలీజ్కు ఇంకా ఆరు రోజుల వ్యవధి ఉండగా, ఇప్పటికే 40 శాతం టికెట్లు అమ్ముడుపోవడంతో లవ్ స్టోరికి సూపర్బ్ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. ఒకవైపు నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారంటూ ఇంటర్నెట్లో, మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నా.. ఈ మూవీపై ఆడియెన్స్ అమితాసక్తి కనపరుస్తున్నారు.
తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెరిగాయి. సింగిల్ స్క్రీన్లో ఒక టికెట్ రూ. 100 నుంచి రూ. 150 దాకా అమ్ముడవుతుండగా, మల్టీప్లెక్స్లలో టిక్కెట్ ధర రూ. 200 ఉంది. రేపు జరిగే మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. మరోవైపు చైతూ ఇప్పటికే సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు. పర్సనల్ ప్రశ్నలు అడగవద్దని ముందే చెప్పేస్తున్నాడు.
'లవ్ స్టో'రి విషయానికి వస్తే, కరోనా మహమ్మారి కారణంగా పలుమార్లు విడుదల వాయిదాపడ్డ సినిమా ఎట్టకేలకు వచ్చేవారం థియేటర్లలో ప్రత్యక్షమవుతోంది. 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇక అటు శేఖర్తో, ఇటు సాయిపల్లవితో చైతూకు ఇదే తొలి చిత్రం. పవన్ సిహెచ్. మ్యూజిక్ ఇచ్చిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. "సారంగ దరియా" పాటైతే, వ్యూస్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈశ్వరీరావు, దేవయాని, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి సి. విజయ్కుమార్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు.