లేడీస్ కోసం శెట్టి స్పెషల్ షో!
on Sep 12, 2023

నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులతో పాటు, సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సినీ ప్రియులకు, ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కు థాంక్స్ చెప్పారు అనుష్క. అలాగే ఈ గురువారం తెలుగు రాష్ట్రాల్లో లేడీస్ కోసం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' స్పెషల్ షో ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు.
అనుష్క మాట్లాడుతూ.. "మా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు థాంక్స్. మీ మెసేజెస్, ట్వీట్స్, ప్రేమ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ గురువారం ఏపీ, తెలంగాణలోని థియేటర్స్ లో లేడీస్ కోసం మా మూవీ స్పెషల్ షో ప్రదర్శిస్తున్నాం. మీ ఇంట్లో చిన్నవాళ్లను, పెద్ద వాళ్లను ఈ స్పెషల్ షోకు తీసుకువెళ్లండి. మీ రెస్పాన్స్ కోసం వేచి చూస్తుంటాను" అన్నారు.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ మూవీ ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



