బాలయ్య, మంచు విష్ణు.. సేమ్ రూట్..
on Feb 25, 2021
ఈ ఏడాది నటసింహ నందమూరి బాలకృష్ణ, టాలెంటెడ్ హీరో మంచు విష్ణుకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ క్యాలెండర్ ఇయర్ లో వీరి నుంచి రానున్న తొలి సినిమాలు.. ప్రత్యేక సందర్భాల్లోనే థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఇంకా చెప్పాలంటే.. బాలయ్య, మంచు విష్ణు సేమ్ రూట్ లో వెళుతున్నారనే చెప్పాలి.
ఆ వివరాల్లోకి వెళితే.. తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలయ్య ఓ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. `సింహా`, `లెజెండ్` తరహాలో ఇందులోనూ బాలయ్యని రెండు విభిన్న పాత్రల్లో చూపబోతున్నారు బోయపాటి. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తండ్రి పుట్టినరోజున బాలయ్య కథానాయకుడిగా నటించిన సినిమా రానుండడం విశేషమనే చెప్పాలి.
కట్ చేస్తే.. బాలయ్య కంటే ముందు మంచు విష్ణు కూడా తండ్రి పుట్టినరోజున కొత్త చిత్రంతో పలకరించబోతున్నాడు. `మోసగాళ్ళు` పేరుతో రూపొందిన ఈ మల్టీలింగ్వల్ మూవీ.. మోహన్ బాబు బర్త్ డే స్పెషల్ గా మార్చి 19న రిలీజ్ కానుందని టాక్.
మరి.. సేమ్ రూట్ లో వెళుతున్న బాలయ్య, విష్ణుకి కొత్త చిత్రాలతో ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.