అప్పుడు `గీతగోవిందం`.. ఇప్పుడు `పుష్ప`..
on Feb 25, 2021
కన్నడ కస్తూరి రష్మిక మందన్న చేసింది తక్కువ సినిమాలే అయినా.. సక్సెస్ రేట్ మాత్రం ఎక్కువనే చెప్పాలి. కన్నడ, తెలుగు భాషల్లో ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాల్లో చాలా మటుకు విజయం సాధించాయి. అయితే రష్మిక నటించిన సినిమాలన్నింటిలోనూ `గీత గోవిందం` ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. నటిగా ఈ చిత్రం రష్మికకి ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. 2018 పంద్రాగస్టు కానుకగా ఈ
రొమాంటిక్ ఎంటర్ టైనర్ రిలీజ్ అయింది.
కట్ చేస్తే.. ఇప్పుడదే పంద్రాగస్టు వారాంతానికి మూడేళ్ళ తరువాత రష్మిక నాయికగా మరో సినిమా రాబోతోంది. అదే.. `పుష్ప`. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్
రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో.. రష్మిక నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనుంది. ఆగస్టు 13న పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంతో మరో పంద్రాగస్టు బ్లాక్ బస్టర్ ని
తన ఖాతాలో వేసుకుంటానన్న ధీమాతో ఉంది మిస్ మందన్న. మరి.. పంద్రాగస్టు సెంటిమెంట్ రిపీట్ అయి రష్మిక ఖాతాలో మరో మెమరబుల్ మూవీ చేరుతుందేమో చూడాలి.