మహేశ్ లాగే పవన్ కూడా కలిసొస్తాడా!
on Dec 4, 2021
`విరాసత్`, `దిల్ చాహ్తా హై`, `కోయి.. మిల్ గయా`, `బ్లాక్`, `ఫనా`, `రబ్ నే బనా ది జోడీ`, `గజిని` వంటి బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీస్ కి సినిమాటోగ్రఫీని అందించిన వైనం రవి కె. చంద్రన్ సొంతం. స్వతహాగా తమిళయన్ అయిన రవి.. మాతృభాషతో పాటు మలయాళంలోనూ సినిమాలు చేశాడు. అలాగే తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో ఓ సినిమాని డైరెక్ట్ చేశాడు.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన `భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన రవి కె. చంద్రన్.. మొదటి ప్రయత్నంలోనే ఇక్కడ విజయాన్ని అందుకున్నాడు. కట్ చేస్తే.. దాదాపు నాలుగేళ్ళ తరువాత మళ్ళీ `భీమ్లా నాయక్`తో మరోసారి పలకరించబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా.. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. మరి.. మహేశ్ బాబు కాంబినేషన్ లో విజయాన్ని అందుకున్న రవి కె. చంద్రన్ కి.. పవన్ కళ్యాణ్ కూడా కలిసొస్తాడేమో చూడాలి.
కాగా, `భీమ్లా నాయక్`కి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చుతున్నారు
Also Read