'లైగర్' సెన్సార్ రిపోర్ట్.. పూరి మార్క్ మాస్ ట్రీట్!
on Aug 5, 2022
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్'. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఇది పూరి మార్క్ మాస్ ట్రీట్ అని తెలుస్తోంది.
2 గంటల 20 నిమిషాలు(140 నిమిషాలు) నిడివి గల ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఫస్ట్ హాఫ్ నిడివి 1 గంట 15 నిమిషాలు కాగా, సెకండాఫ్ నిడివి 1 గంట 5 నిమిషాలట. సినిమాలో మొత్తం ఆరు పాటలు, ఏడు ఫైట్లు ఉన్నట్లు సమాచారం. అంటే ఫైట్లు, పాటలే సగం నిడివి కవర్ చేయనున్నాయన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఇది పక్కా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన సినిమా అని అర్థమవుతోంది.
పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
