లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్!
on Jan 13, 2022
ప్రముఖ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. లతా మంగేష్కర్కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ తాజాగా ఆమె హెల్త్ అప్డేట్ ఇచ్చారు.
లతా మంగేష్కర్ ను ఇంకా ఐసీయూలో ఉంచామని.. ప్రస్తుతం స్వల్పంగా ఆమె కోలుకుంటున్నారు అని ప్రతీత్ సమ్దానీ తెలిపారు. ఆమె కరోనాతో పాటు నిమోనియాతో కూడా బాధపడుతున్నారని, ఇంకో పదిరోజులు ఆమెని ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచుతామని ప్రతీత్ సమ్దానీ పేర్కొన్నారు.
2019 నవంబర్ లో లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా ఆమె కరోనా బారిన పడ్డారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ కి స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆమె వయస్సు, ఇతర అనారోగ్య సమస్యల దృష్ట్యా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Also Read