ప్రభాస్ చేస్తున్న సినిమాలకు విభిన్నంగా మారుతి చిత్రం!
on Jan 27, 2023
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. ఈయన చిత్రాలన్నీ వందల కోట్ల బడ్జెట్తో రూపొందుతున్నాయి. ఆది పురుష్, , సలార్ ప్రాజెక్ట్ కె లతోపాటు తాజాగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా అనౌన్స్ అయ్యింది. మరోపక్క సలార్ పూర్తయిన వెంటనే దిల్ రాజు ప్రభాస్ ప్రశాంత్ నీల్తో కలిసి రెండో చిత్రంగా మరో పాన్ ఇండియా చిత్రం రావణం ను అనౌన్స్ చేశారు. దాంతో ప్రభాస్ లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ చిత్రాలన్నీ పాన్ ఇండియా చిత్రాలైనప్పటికీ ప్రభాస్ అనూహ్యంగా తెలుగులో ఎంటర్టైన్మెంట్ చిత్రాలను అతి తక్కువ బడ్జెట్లో అతి తక్కువ సమయంలో తీసే మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తూ ఉండడం విశేషం. ఇది పాన్ ఇండియా చిత్రం కాదని కేవలం తెలుగు ప్రేక్షకులను వారి అభిరుచిని, ప్రభాస్ నుంచి వారు ఏమి కోరుకుంటున్నారో వాటిని అందించే చిత్రమేనని తెలుస్తోంది. ఇలా పాన్ ఇండియా స్టార్ కాస్త మరోసారి టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ గా మారారు.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఏమి బయటకు రాకుండా యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇటీవల ప్రభాస్ సెట్ లో ఉన్న ఫోటో ఒకటి విడుదలై బాగా వైరర్ అయింది. ఇక ఈ సినిమా కామెడీ హర్ర థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతోందని వార్తలు వస్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాలో నిర్మిస్తోంది. ఇప్పటికి కూడా ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఎలాంటి వార్త వచ్చినా అది కేవలం పుకారే గాని ఇది నిజమని ఖరారు చేయలేని పరిస్థితి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కానీ ఇందులో ప్రభాస్ మాత్రం ఒకే షెడ్యూల్లో పాల్గొన్నారు. మూడో షెడ్యూల్లో ప్రభాస్ కు సంబంధించిన ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ మాళవిక మోహనన్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం.
మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా ఓ హీరోయిన్ అంటున్నారు మూడో హీరోయిన్గా రిద్ది కుమార్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినిమా ఆటోగ్రాఫర్ కార్తీక్ పాలని ఒక అప్డేట్ ఇచ్చారు. విజయ వారసుడుకి కూడా ఈయనే సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రం ప్రమోషన్స్ లో ఆయన ప్రభాస్ సినిమా గురించి కీలక సమాచారం బయట పెట్టారు. ప్రచారం జరుగుతున్నట్టుగా నిజంగానే ఇది ఒక ఫన్ ఫిలిం అని కార్తీక్ చెప్పుకొచ్చారు. సినిమా మాత్రం ఏ మాత్రం హెవీగా అనిపించదని ప్రభాస్ చేస్తున్న ప్రస్తుత చిత్రాలన్నింటికీ పూర్తి భిన్నంగా ఉంటుందని కార్తీక్ పళని చెప్పుకొచ్చారు. కాగా ఈ చిత్రాన్ని అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది దసరాకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.