బాషా సీక్వెల్లో అజిత్ కుమార్!
on Jan 27, 2023
నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు అని రజనీకాంత్ చెప్పిన డైలాగ్ గుర్తుందా? బాషా సినిమాను గానీ రజినీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ని గానీ, అంత తేలిగ్గా ఎవరు మర్చిపోలేరు. స్క్రీన్ ప్లే విషయంలో బాషా సినిమా గురించి ఇప్పటికీ రైటర్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు. అంత గొప్పగా ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ప్లేస్ ని సుస్థిరం చేసుకున్న సినిమా బాషా. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతుందనే వార్త కోలీవుడ్ లో వినిపిస్తోంది.
1995లో విడుదలైంది బాషా. ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నారట డైరెక్టర్ విష్ణువర్ధన్. బాషా సీక్వెల్ అనే టైటిల్తో ఈ సినిమాకి సంబంధించి కథ కూడా రెడీ చేసుకున్నారట. తమిళ్లో అగ్రగామి సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిందని వినికిడి.ప్రస్తుతం సత్య జ్యోతి ఫిలిమ్స్ తో భాషా 2 గురించి చర్చలు నిర్వహిస్తున్నారు విష్ణువర్ధన్. అన్ని అనుకున్నట్టే జరిగితే అజిత్ కుమార్ హీరోగా బాషా2 తెరకెక్కుతుందట.
ఇప్పుడున్న యాంబియన్స్కి తగ్గట్టు బాషా సినిమాకి విషయాన్ని లింక్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించాలన్నది విష్ణువర్ధన్ ప్లాన్ అట. అజిత్ హీరోగా ఇటీవల తెగింపు అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో బ్యాంక్ రాబరీ చేసే వ్యక్తిగా అజిత్ నటించారు. త్వరలోనే నయనతార భర్తతో ఓ సినిమా చేయబోతున్నారు అజిత్. అది అజిత్ 62 సినిమా అవుతుంది. ఇప్పుడు బాషా టు అజిత్ నటించే 63వ సినిమా. బాషా టు కథను రజినీకాంత్ కి వినిపించే ప్రయత్నం కూడా జరుగుతుందట. ఆయనకు నచ్చితే బాషా సీక్వెల్లో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నది కోడంబాకం న్యూస్.
Also Read