'ఆదిపురుష్'లో సీతగా '1.. నేనొక్కిడినే' హీరోయిన్?
on Nov 28, 2020
రామాయణం ఆధారంగా రూపొందనున్న 'ఆదిపురుష్' చిత్రంలో శ్రీరామునిగా ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించే ఈ సినిమాలో లంకేష్ (రావణుడు)గా సైఫ్ అలీఖాన్ ఇప్పటికే ఎంపికయ్యాడు. కాగా ముంబై మిర్రర్ రిపోర్ట్ ప్రకారం లేటెస్ట్గా సీత పాత్రకు బాలీవుడ్ నటి కృతి సనన్ ఎంపికైందంట. ఇప్పటికే ఆ పాత్ర చేయడానికి ఆమె అంగీకరించిందనీ, ఇది తనకు లభించిన గొప్ప అవకాశంగా ఆమె భావిస్తోందనీ ఆ టాబ్లాయిట్ రాసింది. జనవరిలోనే ఈ సినిమా షూటింగ్కు సన్నాహాలు జరుగుతున్నాయి.
కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచితురాలే. మోడల్ అయిన ఆమె హీరోయిన్గా పరిచయమైంది తెలుగు సినిమాతోటే. అది మహేశ్ సరసన '1.. నేనొక్కడినే' మూవీతో. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడకపోయినా, ఆమె మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగచైతన్య జోడీగా 'దోచెయ్' సినిమాలో కనిపించింది. బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారడంతో మళ్లీ టాలీవుడ్కు ఆమె రాలేదు.
ఇప్పటిదాకా 'ఆదిపురుష్'లో సీత పాత్రను చేసే అవకాశం ఉందంటూ అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేశ్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు కృతి సనన్ పేరు వినిపిస్తోంది. ఈ ప్రచారమైనా నిజమవుతుందో, లేదో చూడాలి. అలాగే ఇంద్రజిత్ పాత్రకు అంగద్ బేడీ ఎంపికైనట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
Also Read