దసరా రేసులో 4 క్రేజీ ప్రాజెక్ట్స్
on Nov 28, 2020
కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది దసరా సీజన్ బోసిపోయింది. అయితే వచ్చే ఏడాది మాత్రం విజయదశమికి వినోదాల విందు ఖాయంగానే కనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ దసరాకి సరదాలు పంచే దిశగా నిర్మాణం జరుపుకుంటున్నాయని టాక్. ఆ చిత్రాలే.. ఆచార్య, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, పుష్ప.
వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ రాధేశ్యామ్ 2021 వేసవిని టార్గెట్ చేసుకున్నాయి. అయితే పలు కారణాల వల్ల ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సంవత్సరం విజయదశమికి వాయిదా పడే దిశగా ఉన్నాయని ఫిల్మ్ నగర్ ఇన్ఫర్మేషన్.
ఇక జనవరి తొలి వారంలో సెట్స్ పైకి వెళ్ళనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా దసరాకే రావచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే ఇటీవలే పట్టాలెక్కిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పది కూడా అదే సీన్.
మరి.. 2021 దసరా ఛార్ట్ లో చివరాఖరికి ఏయే చిత్రాలు బెర్త్ కన్ఫామ్ చేసుకుంటాయో చూడాలి.
Also Read