యశ్ ని డైరెక్ట్ చేస్తున్న ఈవీవీ హీరోయిన్.. గోవాలో మాములుగా ఉండదు మరి..
on Sep 13, 2023
.webp)
కేజీఎఫ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ నటుడు యశ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే సదరు సిరీస్ లో రాకీ భాయ్ గా తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు ఈ టాలెంటెడ్ స్టార్.
ఇదిలా ఉంటే, కేజీఎఫ్ 2 తరువాత కొత్త సినిమాని మొదలుపెట్టని యశ్.. త్వరలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ని ప్రారంభించనున్నారు. గోవా నేపథ్యంలో సాగే ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. సరికొత్త కథాంశంతో రూపొందనున్న ఈ మూవీ.. సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించబోతున్నారు. తెలుగువారికి కూడా గీతూ మోహన్ దాస్ పరిచితమే. 2001లో విడుదలైన ఈవీవీ సత్యనారాయణ డైరెక్టోరియల్ వీడెక్కడి మొగుడండీ..!లో ఈమె ఓ నాయికగా నటించారు. మరి.. లేడీ డైరెక్టర్ తో యశ్ చేయనున్న ఈ భారీ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



