పాకిస్థాన్ నిర్వహించే ఈవెంట్ కి స్టార్ హీరో! హెచ్చరికలు జారీ
on Aug 4, 2025

2011 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'ప్యార్ కా పంచనామా'తో సినీ రంగ ప్రవేశం చేసిన హీరో 'కార్తీక్ ఆర్యన్'(Kartik Aaryan). ఆ తర్వాత అనతికాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తనకంటు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. రీసెంట్ గా 'చందు ఛాంపియన్, భూల్ భూలయ్య పార్ట్ 3 ' వంటి విభిన్న చిత్రాలతో వరుస విజయాల్ని అందుకొని స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఆషీకీ పార్ట్ 3 ' చేస్తున్నాడు. శ్రీలీల(Sreeleela)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.
ఆగస్టు 15న అమెరికాలోని హ్యూస్టన్లో జరగనున్న 'ఆజాదీ ఉత్సవ్’(Azadi Utsav)కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్ పాల్గొనబోతున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్న 'ఆజాదీ ఉత్సవ్' ని 'అగాస్ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్స్' అనే సంస్థ నిర్వహించబోతుంది. ఈ సంస్థ యజమాని 'షౌకత్ మారేడియా' పాకిస్తానీ మూలాలు కలిగిన వ్యక్తి అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫెడరేషన్ ఆఫ్ సినిమా వర్కర్స్ కాన్ఫెడరేషన్ ఈ విషయంపై స్పందిస్తు పాకిస్థాన్ కి సంబంధించిన వ్యక్తి నిర్వహించే కార్యక్రమంలో కార్తీక్ పాల్గొనకూడదని, ఒకవేళ పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తు ఒక లేఖ కూడా జారీ చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ కూడా స్పందిస్తు దేశ ప్రయోజనాల దృష్ట్యా కార్తీక్ ఆ కార్యక్రమంలో పాల్గొనడం సముచితం కాదని పేర్కొంది.
ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతమైన 'పహల్గామ్'(Pahalgam)లోకి పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించి,మన దేశ పర్యాటకులని అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత పాకిస్థాన్ కి చెందిన కళాకారులని, భారతీయ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఓటిటి వేదికగా కూడా పాకిస్థాన్ మూలాలు ఉన్న సినిమాల్ని సైతం నిషేధించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



