ఓటీటీలో సంచలనం సృష్టించిన 'కార్తికేయ-2'!
on Oct 7, 2022
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ-2' మూవీ ఆగస్టు 13న థియేటర్స్ లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
దసరా కానుకగా అక్టోబర్ 5 నుంచి ఓటీటీ వేదిక జీ5 లో 'కార్తికేయ-2' అవుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం 48 గంటల్లోనే 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఈ విషయాన్ని జీ5 ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ ఘట్టమనేని వ్యవహరించాడు.
Also Read