ENGLISH | TELUGU  

ఎన్టీఆర్ దాచిపెట్టిన ఆ ఇద్దరూ ఎవరో తెలిసిపోయింది..

on Oct 30, 2017

 

'జై లవకుశ'  ప్రీ రిలీజ్ ఫంక్షన్ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కూడా గుర్తుండే ఉంటాయి. ఈ సినిమాలో నటించడానికి ఇద్దరు ముఖ్య కారకులు ఉన్నారని.. ఈ సినిమా చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నపుడు తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు దర్శకుల్ని సలహా అడిగానని.. వాళ్లిద్దరూ ఓకే అన్నాకే ఈ సినిమా చేశానని కానీ వారెవరో ఇప్పుడే చెప్పనని... సినిమా హిట్ అయితేనే చెబుతానని అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. అంతే అప్పటినుండి ఆ ఇద్దరు అభిమానులు ఎవరబ్బా.. అని అభిమానులే కాదు.. చాలామంది జుట్టుపీకున్నారు. అంతేకాదు కొంత మంది ఆ ఇద్దరూ ఎవరో కాదు... ఎస్ఎస్ రాజమౌళి, వీవీ వినాయక్ అని గెస్ చేసి చెప్పారు. ఇక ఆ తరువాత సినిమా రిలీజ్ అవ్వడం.. హిట్ టాక్ తెచ్చుకోవడం అంతా జరిగిపోయింది. కానీ అప్పుడు ఎన్టీఆర్  తాను చెప్పిన మాటలు మర్చిపోయాడేమో కానీ.. అభిమానులు మాత్రం మర్చిపోలేదు. ఈ విషయంపై ఓ అభిమాని రచయిన కోన వెంకట్ ను సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై ప్రశ్నించగా... దానికి కోన వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ వెనుక ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు.. కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పాడు. అంతేకాదు.. అభిమానులు ఓ 50 పర్సెంట్ సక్సెస్ అయ్యారని కూడా అన్నాడు. మొత్తానికి నాడు ఎన్టీఆర్ పెట్టిన సస్పెన్సు ఇన్నాళ్లకు బయటపడింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.