సౌందర్యతో పెళ్లి వద్దనుకున్న జేడీ!
on Feb 27, 2021
వర్మ స్కూల్ నుంచి వచ్చిన జేడీ చక్రవర్తి ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు. 'శివ' వంటి ట్రెండ్ సెట్టర్తో జేడీ పరిచయమైన ఈ హీరో గత కొంత కాలంగా తనకు నచ్చిన, తన దాకా వచ్చిన చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన థ్రిల్లర్ '70 ఎంఎం'. అంతా కొత్త వాళ్లు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది.
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దివంగత నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని, ఆమెతో జరగాల్సిన తన పెళ్లి గురించి వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు ఎవరితో పంచుకోని ఈ విషయాన్ని తాజాగా వెల్లడించి షాకిచ్చారు. మాటల మధ్యలో సౌందర్య టాపిక్ రావడంలో తనకు ఆమెకు పెళ్లి జరగాల్సిందని అసలు విషయం బయటపెట్టారు.
సౌందర్య, జేడీ చక్రవర్తి కలిసి ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన 'ప్రేమకు వేళాయెరా' చిత్రంలో నటించారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే ఎస్వీ కృష్ణారెడ్డి, చంద్రబోస్, సుచిత్ర అంతా కలిసి జేడీకి పెళ్లి చేయాలనుకున్నారట. అదీ సౌందర్యతో చేయాలని ప్లాన్ చేశారట. అయితే ఆ ప్రపోజల్కి తాను అంగీకరించలేదని, దాని వల్ల తమ ప్రొఫెషన్ దెబ్బతింటుందని జేడీ సర్తిచెప్పి పెళ్లికి ఫుల్ స్టాప్ పెట్టారట.
ఆ తరువాత సౌందర్యకు తనకు మధ్య విభేధాలు తలెత్తాయని, ఆ తరువాత కొంత కాలం తాను సౌందర్య మాట్లాడుకోలేదని చెప్పాడు. అయితే ఆ తరువాతే ఇద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్మి అయ్యామని జేడీ చక్రవర్తి తెలిపాడు.