చేతులెత్తేసిన 'జై లవకుశ'..
on Aug 30, 2017
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న'జై లవకుశ' సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమం రద్దుచేస్తున్నట్టు ఎన్టీఆర్ అభిమానులకు చిత్ర యూనిట్ షాకిచ్చింది. నిజానికి ఈ చిత్రం ఆడియోను సెప్టెంబరు 3న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే భారీ వర్షాలు, వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని చిత్ర టీమ్ తెలిపింది. దేవిశ్రీ ప్రసాద్ రూపొందించిన ఆల్బమ్ అందరికీ నచ్చుతుందని పేర్కొంది. కానీ ఇంకో గుడ్ న్యూస్ మాత్రం చెప్పింది చిత్ర టీమ్. అభిమానుల కోసం సెప్టెంబరు 10న హైదరాబాద్లో గ్రాండ్గా పబ్లిక్ ఈవెంట్ను ఏర్పాటు చేసి..అప్పుడే సినిమా ట్రైలర్ను విడుదల చేస్తున్నామని చెప్పింది. దీంతో అభిమానులు కాస్త హ్యాపీగా ఉన్నారు. కాగా బాబి డైరెక్షన్లో.. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ ‘జై లవకుశ’ని నిర్మిస్తున్నారు. నివేదా థామస్, రాశీ ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రెండు పాత్రలు "జై", "లవ" కు సంబంధించి పోస్టర్లు.. వాటికి సంబంధించిన ట్రైలర్ లు కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.