"కుశ" ను గుర్తుపట్టండి..!
on Aug 29, 2017
ఎన్టీఆర్ ‘జైలవకుశ’ లో త్రిపాత్రిభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మూడు పాత్రలలో "జై" "లవ" కు సంబంధించి ఒక్కొక్క పోస్టర్ ను.. వాటికి సంబంధించిన టీజర్లు ఇప్పటికే విడుదల చేశారు. ఇప్పుడు "కుశ" వంతు వచ్చింది. ఇటీవల వినాయక చవితిని పురస్కరించుకుని చిత్రంలోని ‘కుశ’ని చిత్రబృందం ప్రేక్షకులకు పరిచయం చేసింది. తాజాగా ఒక ఫొటోను ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటో పెట్టి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఫొటోలో 200 మంది డ్యాన్సర్ల ఉండగా.. ఆ డ్యాన్సర్ల మధ్యలో "కుశ" డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక ఫొటో పెట్టిన వీరిలో "కుశ" ఎక్కడున్నాడో గుర్తుపట్టారా అని మన మెదడుకే పనిపెట్టారు. మరి ఈఫొటోను మీరూ చూసి "కుశ" ఎక్కడున్నాడో గుర్తుపట్టండి.
కాగా ప్రస్తుతం సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇక బాబి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై వస్తున్న ఈ సినిమాకు కల్యాణ్రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా నివేదా థామస్, రాశి ఖన్నా నటిస్తున్నారు.