సుశాంత్ 'నో పార్కింగ్'ని స్టార్ట్ చేశాడు!
on Jan 30, 2020
సుశాంత్ హీరోగా ఇదివరకు ప్రకటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' మూవీ షూటింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. నాగార్జున హీరోగా వచ్చిన 'ఢమరుకం' సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేసిన ఎస్. దర్శన్ ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. మీనాక్షి చౌధరి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ మూవీలో వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటిస్తున్నారు. 'నో పార్కింగ్' అనేది ఈ మూవీ ట్యాగ్లైన్. ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో షూట్ చేసిన ముహూర్తపు సన్నివేశానికి యోగేశ్వరి క్లాప్ నివ్వగా, వెంకటరత్నం కెమెరా స్విచ్చాన్ చేశారు. సుశాంత్ తల్లి నాగసుశీల మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
సుశాంత్ మాట్లాడుతూ - "ఈ ఏడాది ఆరంభంలోనే 'అల.. వైకుంఠపురములో..' చిత్రంతో మంచి బ్యాంగ్ దక్కింది. ఈ మూవీ ఒక మంచి థ్రిల్లర్. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. 'చి.ల.సౌ' తరువాత ఈ సినిమా చేయాల్సింది. నేను మీనాక్షిని బాంబేలో కలిశాను. ఇద్దరం కలిసి యాక్టింగ్ వర్క్షాప్స్ చేశాం. చాలా టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కర్. నా ప్రతి సినిమా కొత్తదనంతో చేద్దాం అనుకుంటున్నా. కచ్చితంగా ఈ సినిమాలో ఆ కొత్తదనం ఉంది" అన్నారు. హీరోయిన్ మీనాక్షి చౌధరి మాట్లాడుతూ "హీరోయిన్గా ఇది నా ఫస్ట్ మూవీ. ఈ చిత్రంతో దర్శన్ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను. సుశాంత్తో కలిసి నటించడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను" అని చెప్పింది.