కరోనా ముడ్డిమీద తన్ని నెగటివ్ అయ్యాను!
on May 5, 2021
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కొవిడ్-19 నెగటివ్గా టెస్ట్లో తేలింది. కొద్ది రోజుల క్రితం ఆమె పాజిటివ్గా నిర్ధారణ అయ్యి, స్వీయ ఐసోలేషన్లోకి వెళ్లింది. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ మెడికేషన్ తీసుకుంటూ వచ్చిన ఆమె ఆ వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకుంది. తాజాగా తనకు టెస్ట్లో నెగటివ్గా నిర్ధారణ అయ్యిందంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించింది. తను కులాసాగా ఉన్న ఓ పిక్చర్ను పోస్ట్ చేసిన ఆమె, "నా వైపు ప్రేమను పంపిన మీ అందరికీ థాంక్యూ. నేను బాగా రికవర్ అయ్యాను. స్టుపిడ్ కరోనా ముడ్డిమీద తన్ని, చివరకు నెగటివ్గా టెస్ట్లో తేలాను! యే! చూస్తుంటే మీ అందరి విషెస్, హీలింగ్ ఎనర్జీ మ్యాజిక్ చేసినట్లుగా అనిపిస్తోంది. ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందరూ క్షేమంగా ఉండండి." అని రాసుకొచ్చింది. దాంతో ఆమె ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
అదివరకు ఏప్రిల్ 25న తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది. అప్పుడు, "అందరికీ తెలియజేయునది ఏమనగా, టెస్టులో నాకు కొవిడ్-19గా నిర్ధారణ అయ్యింది. అన్ని రకాల ప్రోటోకాల్స్ పాటిస్తూ మా ఇంట్లోనే ఐసోలేషన్లోకి, క్వారంటైన్లోకి వెళ్లాను. ఇటీవల నాకు సన్నిహితంగా మెలగిన వారందరినీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ ప్రేమ, మద్దతుకు థాంక్స్. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. దయచేసి అందరూ ఇంట్లో క్షేమంగా ఉండండి." అని ఆమె రాసుకొచ్చింది.
అంతే కాదు, ఆ తర్వాత రెండు రోజులకే అల్లు అర్జున్ పాజిటివ్గా నిర్ధారణ అయి, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతను షేర్ చేసినప్పుడు, "అమూల్యకు బంటు కంపెనీ ఇస్తున్నట్లుగా ఉంది! జాగ్రత్తగా ఉండు అల్లు అర్జున్. నీకు కొంత హీలింగ్ లైట్ను, ఎనర్జీని పంపుతున్నా. నువ్వు త్వరగా ఆరోగ్యవంతుడివి అవుతావ్!" అని స్పందించింది కూడా.
ప్రస్తుతం ఆమె అఖిల్ జోడీగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ప్రభాస్ సరసన నటించిన 'రాధే శ్యామ్' మూవీ, రామ్చరణ్ జోడీగా చేస్తున్న 'ఆచార్య' వరుసగా రానున్నాయి. హిందీలో రణవీర్ సింగ్తో 'సర్కస్' మూవీ, తమిళంలో విజయ్తో ఓ సినిమా చేస్తోందామె.