ఆయనకు తలబిరుసేమోనని అనుకున్న ప్రిన్స్
on Nov 27, 2013
కృష్ణమాధవ్, అనూష, సంస్కృతి కలిసి నటించిన చిత్రం "హృదయం ఎక్కడున్నది". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు మహేష్ బాబు ముఖ్య అతిదిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. "కృష్ణమాధవ్ నాకు ఖలేజా సినిమా చేస్తున్నప్పటి నుంచి బాగా తెలుసు. పెద్దింటి నుంచి వచ్చాడు కదా. తలబిరుసు ఉంటుందేమో అని అనుకున్నా. కానీ తనలో కష్టపడే తత్వం నాకు బాగా నచ్చింది. అతను తొలిసారి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు. ఈ కార్యక్రమానికి గల్లా అరుణ కుమారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేసారు. గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ... "మా మేనల్లుడు మాధవ్ సినిమాల్లోకి రావడం ఆశ్చర్యంగా ఉంది. హాయిగా అమెరికాలో ఉద్యోగం చేసుకో అని చెప్పిన వినలేదు. ఇన్నాళ్ళకు తన కోరికను ఈ సినిమాతో నెరవేర్చుకున్నాడు అని అన్నారు.