2021 జ్ఞాపకాలుః అలరించిన అగ్ర కథానాయికలు.. `హీరోయిన్ ఆఫ్ ద ఇయర్` సాయిపల్లవి!
on Dec 30, 2021

2021 క్యాలెండర్ ఇయర్ లో అనుష్క మినహాయిస్తే దాదాపు అగ్ర కథానాయికలందరూ సినిమాలతో సందడి చేశారు. ఆ నాయికల వివరాల్లోకి వెళితే..
శ్రుతి హాసన్ః- ఈ ఏడాది ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నాయిక శ్రుతి హాసన్. `క్రాక్`తో ఈ క్యాలెండర్ ఇయర్ లో తొలి ఘనవిజయం చూసిన చెన్నై పొన్ను శ్రుతి.. ఆపై `వకీల్ సాబ్`తో మరో సక్సెస్ చూసింది. `క్రాక్`లో రవితేజ, `వకీల్ సాబ్`లో పవన్ కళ్యాణ్ సరసన శ్రుతి కనువిందు చేసింది.
కాజల్ః- టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది తెలుగునాట `మోసగాళ్ళు` చిత్రంతో ఎంటర్టైన్ చేసింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తనదైన అభినయంతో అలరించింది కాజల్.
తమన్నాః- మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది `సీటీమార్`, `మాస్ట్రో` చిత్రాలతో వారం గ్యాప్ లో సందడి చేసింది. తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా `సీటీమార్`లో సత్తా చాటిన తమన్నా.. ఓటీటీలో స్ట్రీమ్ అయిన `మాస్ట్రో`లో నెగటివ్ రోల్ లో ఆకట్టుకుంది.
సాయిపల్లవిః- ఈ ఏడాది సాయిపల్లవి రెండు సినిమాల్లో కనువిందు చేసింది. `లవ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్`.. ఇలా ఈ సంవత్సరం సాయిపల్లవి నుంచి వచ్చిన రెండు చిత్రాలు కూడా ఆమెకి నటిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. ఈ రెండు సినిమాల్లోనూ నృత్యాలతోనూ మెస్మరైజ్ చేసింది పల్లవి. ఓవరాల్ గా.. హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ అనిపించుకుంది.
పూజా హెగ్డేః- వరుస విజయాలతో ముందుకు సాగుతున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఈ క్యాలెండర్ ఇయర్ లో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో పలకరించింది. అక్కినేని అఖిల్ కి తొలి విజయాన్ని అందించిన నాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ః- ఈ ఏడాది `చెక్`, `కొండ పొలం` చిత్రాలతో వెండితెరపై సందడి చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ రెండు సినిమాల్లోనూ అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో కనిపించింది. అయితే, కమర్షియల్ గా మాత్రం రకుల్ కి ఈ ప్రాజెక్ట్స్ అచ్చిరాలేదనే చెప్పాలి.
శ్రియః- ఈ ఏడాదితో నాయికగా 20 ఏళ్ళ కెరీర్ ని పూర్తిచేసుకున్న ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రియ.. `గమనం` అనే ఆంథాలజీలో అభినయానికి ఆస్కారమున్న పాత్రలో ఆకట్టుకుంది.
నిత్యా మీనన్ః- ఈ సంవత్సరం నిత్యా మీనన్ `నిన్నిలా నిన్నిలా`, `స్కై లాబ్`, `గమనం`లో కనిపించింది. వీటిలో `స్కై లాబ్`కి ఓ నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే, ఈ సినిమాలేవీ ఆశించిన విజయం సాధించలేదు.
రష్మిక మందన్నః- ఈ సంవత్సరం రష్మిక మందన్న రెండు డబ్బింగ్ సినిమాలతోనూ, ఒక స్ట్రయిట్ పిక్చర్ తోనూ సందడి చేసింది. ప్రథమార్ధంలో వచ్చిన అనువాద చిత్రాలు `పొగరు`, `సుల్తాన్` జస్ట్ ఓకే అనిపించుకోగా.. ఏడాది చివరలో వచ్చిన పాన్ - ఇండియా మూవీ `పుష్ప - ద రైజ్`తో తనకి సక్సెస్ దక్కింది.
కీర్తి సురేశ్ః- ఈ క్యాలెండర్ ఇయర్ లో కీర్తి సురేశ్ నాయికగా `రంగ్ దే`, అతిథి పాత్రలో `జాతిరత్నాలు`, ప్రధాన పాత్రల్లో `మరక్కార్` (మలయాళ అనువాదం), `పెద్దన్న` (తమిళ అనువాదం) చిత్రాలు వచ్చాయి. వీటిలో `జాతిరత్నాలు` మాత్రమే విజయం సాధించింది.
నయనతారః- ఈ సంవత్సరం లేడీ సూపర్ స్టార్ నయనతార `నెట్రిక్కన్`, `పెద్దన్న` వంటి అనువాదాల్లో కనిపించింది. అలాగే, చాలాకాలంగా విడుదలకు నోచుకుని `ఆరడుగుల బుల్లెట్` ఈ ఏడాదే తెరపైకి వచ్చింది. అయితే, ఇవేవీ సక్సెస్ కాలేదు.
సమంతః- చెన్నై పొన్ను సమంత ఈ ఏడాది ఒకే ఒక తెలుగు చిత్రంలో దర్శనమిచ్చింది. అది కూడా ప్రత్యేక గీతంలోనే. ఆ సినిమానే.. `పుష్ప - ద రైజ్`. ఇందులో సామ్ ఆడిపాడిన ``ఊ అంటావా మామా`` చార్ట్ బస్టర్ గా నిలిచింది.
ప్రియమణిః- సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఈ ఏడాది `నారప్ప`లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ యాక్షన్ థ్రిల్లర్ నేరుగా స్ట్రీమ్ అయింది.
ప్రగ్యా జైశ్వాల్ః- తెలుగునాట దాదాపు ఏడేళ్ళుగా నాయికగా నటిస్తున్న ప్రగ్యా జైశ్వాల్ కి.. ఈ సంవత్సరాంతంలో విడుదలైన `అఖండ`తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కింది. ఇందులో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన కనువిందు చేసింది ప్రగ్య.
వీరితో పాటు లావణ్య త్రిపాఠి (చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్ ప్రెస్), అంజలి - నివేదా థామస్ (వకీల్ సాబ్), అదితి రావ్ హైదరీ (మహా సముద్రం) వంటి ప్రముఖ కథానాయికలు కూడా ఈ ఏడాది నటనకు అవకాశమున్న పాత్రల్లో ఆకట్టుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



