ఈషా రెబ్బా మాలీవుడ్ ఎంట్రీ
on Jun 12, 2021
`అంతకు ముందు ఆ తరువాత`, `అమీ తుమీ`, `అ` చిత్రాలతో కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి ఈషా రెబ్బా. `అరవింద సమేత వీరరాఘవ` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ లోనూ కీలక పాత్రల్లో దర్శనమిచ్చింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. అంతేకాదు.. ఆ మధ్య `ఓయ్` (2016) అనే తమిళ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఐదేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు `ఆయిరమ్ జన్మన్ గళ్` అనే మరో తమిళ సినిమాలోనూ నటిస్తోంది ఈషా.
ఇదిలా ఉంటే.. త్వరలో ఈషా మలయాళ చిత్ర సీమ బాట పడుతోందని సమాచారం. అది కూడా.. ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో. ఆ వివరాల్లోకి వెళితే.. `నిరమ్` (`నువ్వే కావాలి` మాతృక) ఫేమ్ కుంచకో బోబన్ కథానాయకుడిగా ఓ మలయాళ సినిమా తెరకెక్కనుంది. ఫెల్లి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. కాగా, ఈ సినిమాలో కుంచకో బోబన్ కి జంటగా ఈషా నటించనుందట. అంతేకాదు.. ఈ చిత్రం కోసం రైఫిల్ షూటింగ్, బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందట మిస్ రెబ్బా.
మరి.. ఈషా మాలీవుడ్ ఎంట్రీ ఆమె కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.