వైష్ణవ్ తేజ్ థర్డ్ ఫిల్మ్ డీటైల్స్ వచ్చేశాయ్
on Mar 9, 2021
కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం 'ఉప్పెన'తోనే సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్. త్వరలో ఈ యువ కథానాయకుడు.. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందించిన 'జంగిల్ బుక్' (ప్రచారంలో ఉన్న టైటిల్)తో సందడి చేయనున్నాడు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ప్రసిద్ధ నవల 'కొండ పొలం' ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. ఆగస్టులో రిలీజ్ కానుందని టాక్. ఈ లోపే తన థర్డ్ వెంచర్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు వైష్ణవ్.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని.. ఓ నూతన దర్శకుడు ఈ సినిమాని రూపొందించనున్నాడని తెలిసింది. అంతేకాదు.. 'ఉప్పెన' విజయంలో కీలక పాత్ర పోషించిన సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్.. ఈ ప్రాజెక్ట్ కి కూడా ఛాయాగ్రహకుడిగా పనిచేయనున్నాడని టాక్. త్వరలోనే వైష్ణవ్ తేజ్ మూడో చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మరి.. 'ఉప్పెన' తరువాత మరోసారి జట్టుకట్టనున్న వైష్ణవ్, శ్యామ్.. ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి. ఈ మూవీకి వైష్ణవ్కు భారీ స్థాయి రెమ్యూనరేషన్ లభిస్తోందని వినికిడి.
Also Read