2021లో మెగాస్టార్ డబుల్ బొనాంజా!
on Sep 30, 2020
తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సరైన సినిమా చూసి ఆరు నెలలు దాటింది. సంక్రాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల... వైకుంఠపురములో' చిత్రాలు ప్రేక్షకులకు వినోదాల విందు అందించాయి. ఆ తర్వాత నితిన్ 'భీష్మ' మంచి విజయం సాధించింది. థియేటర్ లు ఓపెన్ అయిన తర్వాత పెద్ద సినిమాలు వెంటనే విడుదలయ్యే అవకాశం లేదు. అయితే, మెగాస్టార్ మాత్రం వచ్చేయడానికి థియేటర్లలో ప్రేక్షకులకు డబుల్ బొనాంజా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కనుక అడ్డు పడకపోతే ఈ పాటకి థియేటర్లలోకి సినిమా వచ్చేది. వచ్చే నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి కల్లా సినిమా మొత్తం పూర్తవుతుందని తెలిసింది. ఆ వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్ చిత్రీకరణ ప్రారంభించడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధంగా ఉన్నారు.
వేసవికి 'ఆచార్య'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఆ తరువాత విజయదశమికి 'వేదాళం' రీమేక్ విడుదల చేయాలని మెగాస్టార్ నిర్ణయించారట. మొత్తం మీద వచ్చే ఏడాది మెగాస్టార్ నుంచి రెండు సినిమాలు రావడం అయితే ఖాయంగా కనబడుతోంది.
Also Read