అందులో ఏమాత్రం నిజం లేదు గైస్.. 'పుష్ప' గురించి క్లారిటీ ఇచ్చిన మాధవన్!
on Sep 30, 2020
ముందు విజయ్ సేతుపతి ఓకే అన్నాడు. కానీ, తరవాత కుదరదన్నాడు. అల్లు అర్జున్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయడానికి హీరోగా నటిస్తున్న తమిళ సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు అడ్డు వస్తున్నాయని చెప్పాడు. దాంతో అతడి స్థానంలో మాధవన్ వచ్చాడని కొందరు రాశారు. ఇదంతా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా 'పుష్ప' గురించి!
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'పుష్ప' నుండి విజయ్ సేతుపతి తప్పుకున్న తరవాత మాధవన్కి సుకుమార్ కథ చెప్పారనీ, ఆయన నటించడానికి ఓకే అన్నారని వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని మాధవన్ ట్వీట్ చేశారు. ఒక వెబ్సైట్ రాసిన న్యూస్ ఐటమ్ ట్వీట్ను రిట్వీట్ చేసిన ఆయన, "Not true at all guys" అని పోస్ట్ చేశారు.
నవంబర్ నుండి 'పుష్ప' చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు విలన్ సెలక్షన్ కంప్లీట్ అవుతుందేమో. అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా నటించనున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన కొన్ని ట్యూన్లు రెడీ చేసి ఇచ్చారు. అల్లు అర్జున్ కూడా క్యారెక్టర్ కోసం లుక్ మార్చారు. చిత్రీకరణ ప్రారంభిస్తే త్వరత్వరగా పూర్తి చేస్తారేమో చూడాలి.