తారక్ తో మాట్లాడాను.. చాలా హ్యాపీగా ఉంది: చిరంజీవి
on May 12, 2021

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారక్ హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తారక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. పలువురు ప్రముఖులు తారక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. తారక్ తో ఫోన్ లో మాట్లాడానని, తను చాలా ఉత్సాహంగా, ఎర్జిటిక్గా ఉన్నారని తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు.
‘‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. తను చాలా ఉత్సాహంగా, ఎర్జిటిక్గా ఉన్నారని తెలుసుకుని సంతోషపడ్డాను. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ తారక్’’ అంటూ చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



