దసరా రేసులో మెగా బ్రదర్స్ రీమేక్స్?
on Jan 19, 2021
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ స్టార్ బ్రదర్స్ ఇద్దరి ఖాతాలోనూ మలయాళ రీమేక్స్ ఉన్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ సెన్సేషనల్ హిట్ లూసీఫర్ ని చిరు రీమేక్ చేస్తుండగా.. మరో మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషీయుమ్ ని పవన్ రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నాయి. జనవరి 21న లూసీఫర్ రీమేక్ పట్టాలెక్కనుండగా.. జనవరి 22న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
అంతేకాదు.. ఈ రెండు రీమేక్స్ కూడా ఈ ఏడాది దసరా బరిలోనే దిగుతున్నాయని సమాచారం. అందుకు తగ్గట్టే.. చకచకా చిత్రీకరణని జరిపేందుకు యూనిట్స్ సన్నాహాలు చేస్తున్నాయట. వారం, పది రోజుల గ్యాప్ లో విజయదశమి సీజన్ లో రానున్న ఈ మాలీవుడ్ రీమేక్స్ తో మెగా బ్రదర్స్ చిరు, పవన్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
లూసీఫర్ రీమేక్ కి మోహన్ రాజా దర్శకత్వం వహించనుండగా.. అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కి సాగర్ చంద్ర దర్శకుడు.