శ్రీవిష్ణుతో కేథరిన్?
on Feb 12, 2021
ఇద్దరమ్మాయిలతో, పైసా, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో తెలుగువారిని అలరించిన కథానాయిక.. కేథరిన్ ట్రెసా. వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత మరే తెలుగు సినిమాలోనూ ఈ టాలెంటెడ్ బ్యూటీ దర్శనమివ్వనేలేదు. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వశిష్ట్ మల్లిడి రూపొందిస్తున్న చిత్రంలో ఓ హీరోయిన్ గా కేథరిన్ నటిస్తున్నట్లు తెలిసింది.
అంతేకాదు.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి కూడా కేథరిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా ఈగ నిర్మాత సాయి కొర్రపాటి ఓ సినిమాని నిర్మించనున్నారు. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి తెరకెక్కించనున్న ఈ మూవీలో శ్రీవిష్ణుకి జోడీగా కేథరిన్ ట్రెసా ఎంపికైందని టాక్. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో కేథరిన్ కనిపిస్తుందని సమాచారం. త్వరలోనే శ్రీవిష్ణు, చైతన్య దంతులూరి కాంబో మూవీలో కేథరిన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.