పోసాని ఇంటికెళ్లి బోరున ఏడ్చిన డైరెక్టర్
on Oct 18, 2016
అదేంటో ఈమధ్య అందరూ బోయపాటి శ్రీనుమీద పడుతున్నారు. తన కథల్ని వాడుకొని కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని ఆమధ్య కొరటాల శివ బోయపాటిపై ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు పోసాని కృష్ణ మురళి కూడా బోయపాటిని టార్గెట్ చేస్తూ ఘాటుగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. బోయపాటి, పోసానీల మధ్య బంధుత్వం ఉంది. ఆ చొరవతోనే... బోయపాటిని ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్గా చేర్పించాడు పోసాని. బోయపాటికి కొన్నాళ్లు అన్నం పెట్టిన రచయిత పోసాని. ఓసారి.. బోయపాటికి పెళ్లయి, పిల్లోడు పుట్టి, భార్యా బిడ్డలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు డబ్బుల్లేక.. పోసాని ఇంటికెళ్లి బోరున ఏడ్చాడట బోయపాటి.
ఆ సమయంలో ఆసుపత్రి బిల్లు కట్టి బోయపాటిని ఆదుకొన్నా.. అంటున్నాడు పోసాని. అలాంటి పోసానికీ, బోయపాటికీ మధ్య గొడవ ఎందుకొచ్చింది? దీనిపై పోసాని స్పందించాడు. శ్రావణమాసం అనే సినిమా తీసి దర్శకుడిగా ఫ్లాపయ్యాడు పోసాని. ఆ సమయంలో పోసాని ఇంటికెళ్లాడట బోయపాటి. ఆ సమయంలో.. పోసాని ఇంట్లో లేడట. ఆయన భార్య మాత్రమే ఉన్నారట.‘వదినా… నేనంటే సినిమా డైరక్షన్ డిపార్టుమెంటులో ఉన్నాం, అన్నయ్య లేడు కదా అందుకే సినిమా పోయింది… అయ్యో రేపట్నుంచి ఇన్సురన్సు కట్టాలన్నా, డ్రైవర్ జీతాలు ఇవ్వాలన్నా, ఎలా కట్టగలుగుతారు’అంటూ ఎగతాళిగా మాట్లాడాడట బోయపాటి శ్రీను. ఆ మాటలు పోసానిని బాగా ఇబ్బంది పెట్టాయట. తాను ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అనాల్సిన మాటలేనా అవి.. ? అంటూ పోసాని తన బాధనంతా వెళ్లగక్కాడు. అదీ పాయింటే మరి. అయితే నిజానిజాలేంటో బోయపాటి నోరు విప్పితే గానీ తెలీదు. వీటిపై బోయపాటి స్పందిస్తాడా, లేదా? చూడాల్సిందే.
Also Read